
మెదక్, వెలుగు: మాజీ సీఎం కేసీఆర్కు సొంత జిల్లాలో ఎమ్మెల్సీ అభ్యర్థులు కరువయ్యారని మెదక్ ఎంపీ రఘునందన్ రావుఎద్దేవా చేశారు. మంగళవారం ఆయన మెదక్ లో మీడియాతో మాట్లాడారు. టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలకు బీఆర్ఎస్ అభ్యర్థులను పెట్టకపోవడం దారుణమన్నారు. ఈ విషయంలో యువరాజు(కేటీఆర్) సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్కు ప్రజలు ఎప్పుడో వీఆర్ఎస్ ఇచ్చారన్నారు. దేవిప్రసాద్ లాంటి వ్యక్తికి ఎందుకు ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వరని ప్రశ్నించారు. బీఆర్ఎస్ తోక ముడవడంతో బీజేపీ గెలుపు నల్లేరు మీద నడకలా మారిందన్నారు. విద్యాధికులంతా బీజేపీ వైపే ఉన్నారని చెప్పారు.